News April 13, 2025
ADB: FREE TRAINING& JOBS

ఆదిలాబాద్ బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్& ఫైనాన్స్లో ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ ఎగ్జామ్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 104 మంది APPLY చేయగా శనివారం 50 మంది ఎగ్జామ్ రాశారు. ఈ నెల 15న ఫలితాలు ప్రకటించనున్నారు. త్వరలో HYDలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని బీసీ సంక్షేమ అధికారి రాజలింగు తెలిపారు.
Similar News
News December 8, 2025
పల్నాడు: కంటతడి పెట్టించిన తల్లి ఆక్రందన

వినుకొండకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుందుర్తి హనుమత్ శాండిల్య (32) విహారయాత్ర నిమిత్తం అస్సాం వెళ్లి, ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. యువకుడి మృతదేహం ఆదివారం వినుకొండ చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రవి, రమాదేవి తమ ఏకైక కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ‘అమ్మతో ఒక్కసారి మాట్లాడయ్య’ అంటూ ఆ తల్లి చేసిన ఆక్రందన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
News December 8, 2025
ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్ష!

ఆదోని జిల్లా సాధనపై అన్ని వర్గాలు కదం తొక్కుతున్నాయి. నెల రోజులుగా నిరసనలు చేస్తూ జిల్లాతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యాలపై జిల్లా నేతలు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.


