News April 13, 2025

ADB: FREE TRAINING& JOBS

image

ఆదిలాబాద్ బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్& ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ ఎగ్జామ్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 104 మంది APPLY చేయగా శనివారం 50 మంది ఎగ్జామ్ రాశారు. ఈ నెల 15న ఫలితాలు ప్రకటించనున్నారు. త్వరలో HYDలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని బీసీ సంక్షేమ అధికారి రాజలింగు తెలిపారు.

Similar News

News December 4, 2025

తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

image

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్‌(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్‌లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.

News December 4, 2025

ఖమ్మం: చిన్న పంచాయతీలు.. ఓటర్ల అయోమయం

image

చిన్న పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పార్టీ గుర్తులు లేకపోవడం, ఒక్కో పదవికి పదుల సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఏకంగా 10 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉండటం పోటీ తీవ్రతకు నిదర్శనం. ఈ నెల 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది.

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.