News August 28, 2025
ADB: HYD వెళ్తున్నారా..? రూట్ మార్పు!

మీరు హైదరాబాద్ వెళ్తున్నారా అయితే ఈ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమైనందున, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ వద్ద కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు డైవర్షన్ తీసుకోవాలని నిర్మల్ పోలీసులు సూచించారు. అక్కడి నుంచి మామడ, ఖానాపూర్, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా HYD చేరుకోవాలని కోరారు.
Similar News
News August 28, 2025
ఇథనాల్ పెట్రోల్తో గడ్కరీ కుమారుడి కంపెనీకి భారీ లాభాలు: కాంగ్రెస్

ఇథనాల్ పెట్రోల్తో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ కంపెనీ భారీగా లబ్ధి పొందుతోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. 2024 జూన్ త్రైమాసికానికి ఆయనకు చెందిన CIAN ఆగ్రో ఆదాయం కేవలం రూ.17 కోట్లు ఉంటే ఏడాది కాలంలోనే అది రూ.511 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్ విలువ రూ.43 నుంచి రూ.668కి ఎగబాకిందని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు నాశనం అవుతుంటే నిఖిల్ వ్యాపారం విస్తరిస్తోందని తెలిపింది.
News August 28, 2025
వర్షాలపై వరంగల్ పోలీస్ హెచ్చరిక

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వర్షాల వల్ల రహదారులు జలమయం కావొచ్చని, అటువంటి సమయంలో నడవడం లేదా వాహనాలు నడపడం ప్రమాదకరమని సూచించింది. తక్కువ లోతు ఉన్న నీటిలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఈ సందేశాన్ని తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
News August 28, 2025
ఈ నెల 30న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. అపోలో ఫార్మసీ, టాటా ఏఐఏ, న్యూ ఇన్నోలెర్న్ సంస్థల్లో 123 ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు గల టెన్త్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.