News March 4, 2025

ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News December 9, 2025

కలెక్టర్ సార్.. శ్రీకాళహస్తిలో శ్మశానాన్నీ వదలడం లేదు..!

image

శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడి ఇసుకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో చెన్నైకు లారీలతో తరలిస్తున్నారు. శుకబ్రహ్మ ఆశ్రమం వద్ద మొదలు పెడితే తొట్టంబేడు చివరి వరకు ఎక్కడో ఒకచోట ఇసుక తవ్వతూనే ఉన్నారు. చివరకు శ్మశానంలో సైతం తవ్వకాలు చేస్తున్నారు. మనిషి అస్తిపంజరాలను సైతం తవ్వేసి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై తిరుపతి కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News December 9, 2025

ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

ఎన్నికల పోలింగ్ రోజు సెలవు: కలెక్టర్

image

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పోలింగ్‌ జరిగే ఆయా మండలాల్లో స్థానిక సెలవు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్‌ ప్రకటించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ స్థానిక సెలవులను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.