News December 20, 2025
ADB: PG విద్యార్థులకు ఆదివారం తరగతులు

డా.బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సెలింగ్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వర్సిటీ అధ్యయన కేంద్రంలో ఈ నెల 21న ఈ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News December 30, 2025
కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.
News December 30, 2025
REWIND: సైబర్ క్రైమ్లో 205 మంది అరెస్ట్.. విశాఖ సీపీ

విశాఖలో 2025లో సైబర్ క్రైమ్ సంబంధించి 205 మందిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. వీరి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. వార్షిక సమావేశం ముగింపులో ఆయన మాట్లాడారు. విశాఖలో నేర, శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
News December 30, 2025
KNR: దివ్యాంగుల జంటలకూ రూ.లక్ష వివాహ ప్రోత్సాహకం

దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 19, 2025 తర్వాత వివాహం చేసుకున్నవారు www.epass.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను స్థానిక ఐసీడీఎస్(ICDS) కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు.


