News December 18, 2025
ADB: UPSCలో సత్తా చాటిన జిల్లా యువకుడు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు నోముల సాయి కిరణ్ 82వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ-గంగన్నల కుమారుడు సాయి కిరణ్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) సాధించాడు. పలువురు సాయి కిరణ్కు అభినందిస్తున్నారు.
Similar News
News December 19, 2025
నెల్లూరు: 21 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో 21 నుంచి 23వ తేదీ వరకు 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో కార్యక్రమం జరగనుంది. 2.94 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2396 పోలియో బూత్లలో వీరికి చుక్కలమందు వేయనుండగా.. 403 హై రిస్క్ ఏరియాలు, 82 మొబైల్ బూత్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేకంగా బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 19, 2025
ఆసిఫాబాద్: ఓటుకు ‘మహారాష్ట్ర’ మందు..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర మద్యం ఏరులై పారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పొరుగు రాష్ట్రం నుంచి దేశీ దారును భారీగా దిగుమతి చేసుకున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు ఉన్నప్పటికీ, అక్రమ మార్గాల్లో తరలించి పంపిణీ చేసినట్లు సమాచారం. ASF, MNCL జిల్లాల్లోని దాదాపు 150 గ్రామాల్లో ఈ మద్యం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా పడినట్లు తెలుస్తోంది.
News December 19, 2025
సంగారెడ్డి:ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ నెల 22, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు,29,30 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.


