News July 27, 2024
ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్లు

AP: రాష్ట్రానికి అదనపు ఐపీఎస్లను కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత, ఇతర అంశాలపై వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మరింత మంది అధికారుల అవసరముందని విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అదనంగా 30 మంది IPS అధికారుల్ని కేటాయించింది. దీంతో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్లు సంఖ్య 174కి చేరనుంది.
Similar News
News November 13, 2025
17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్పై ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.
News November 13, 2025
BOB క్యాపిటల్లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.bobcaps.in/
News November 13, 2025
నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <


