News July 25, 2024

ఎరువులపై అదనపు వసూళ్లు

image

TG: రాష్ట్రంలో జోరు వర్షాలతో వానాకాలం సాగుకు సంబంధించి యూరియా, డీఏపీలకు డిమాండ్ పెరిగింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు దుకాణదారులు ఎరువులు విక్రయించేవారు. ఇప్పుడు రవాణా ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. బస్తా యూరియా రూ.273 కాగా రూ.300 తీసుకుంటున్నారు. డీఏపీ రూ.1,150 ఉండగా రూ.1,200 తీసుకుంటున్నారు. డిమాండ్ ఇంకా పెరిగితే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News

News November 20, 2025

542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/

News November 20, 2025

ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్‌

image

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్‌. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.

News November 20, 2025

బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్‌.. అసలు తేడా ఏంటి?

image

బాత్‌రూమ్‌, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్‌ పదాలకు వేర్వేరు అర్థాలతో పాటు వీటి వినియోగం కూడా భిన్నంగా ఉంటుంది. బాత్‌రూమ్‌ అనేది ఇంటిలో ఉండే వ్యక్తిగత గది. ఇందులో టాయిలెట్‌తో పాటు షవర్ లేదా బాత్‌టబ్ ఉంటుంది. వాష్‌రూమ్‌లో స్నానం చేసేందుకు సౌకర్యం లేకపోయినా టాయిలెట్, సింక్ ఉంటాయి. ఇవి ఆఫీసులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఉంటాయి. రెస్ట్‌రూమ్‌ మరింత ఫార్మల్‌గా, చిన్న విరామానికి అనుకూలంగా ఉంటుంది.