News August 13, 2024

రెవెన్యూ సదస్సులు వాయిదా: మంత్రి

image

AP: ఈ నెల 16 నుంచి నిర్వహించాల్సిన రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వీటిని నిర్వహిస్తామని వెల్లడించారు. పాత అధికారులతోనే నిర్వహిస్తే సరైన ఫలితాలు రావన్నారు. ఇందులో భూ వివాదాలు, రీసర్వేలో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, 45 రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.

Similar News

News February 8, 2025

SSMB29లో నానా పటేకర్?

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో SSMB29 మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

News February 8, 2025

కార్తీ ఖైదీ-2లో కమల్ హాసన్?

image

లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా ఖైదీ-2 మూవీ త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. లోకేశ్-కమల్ కాంబోలో 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగానే ఖైదీ సీక్వెల్ కూడా ఉండనుంది.

News February 8, 2025

ఢిల్లీ దంగల్‌లో విజేత ఎవరు? నేడే కౌంటింగ్

image

దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉ.7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మ.12కు క్లారిటీ రానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద EC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.

error: Content is protected !!