News October 22, 2024
మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం మేరకు 288 స్థానాల్లో కాంగ్రెస్ 105-110 స్థానాల్లో, శివసేన UBT 90-95 స్థానాల్లో, NCP SP 75-80 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నాయి. కాంగ్రెస్-ఉద్ధవ్ మధ్య లుకలుకలు నడుస్తున్నాయన్న వార్తల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గమనార్హం.
Similar News
News October 22, 2024
సిరాజ్ పేలవ ప్రదర్శన.. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్!
ఈ ఏడాది టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని పేసర్ సిరాజ్ను టీమ్ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేసిన సిరాజ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇటీవల NZతో తొలి టెస్టులో 2 వికెట్లు తీశారు. దీంతో అతడిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి, నెక్స్ట్ మ్యాచులో ఆకాశ్ దీప్కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
News October 22, 2024
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో ఉ.11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్త పన్ను రద్దు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనుంది.
News October 22, 2024
రేపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ భేటీ
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్లో పెట్రోలింగ్పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.