News August 9, 2024

గౌరవెల్లి ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు

image

TG: గౌరవెల్లి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.431.30 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. SRSP-IFFC ప్యాకేజీ నం.7 బ్యాలెన్స్ పనులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కరవు ప్రాంతాల్లో 1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ దశతో సంబంధం లేకుండా టెండర్లు పిలవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

Similar News

News November 19, 2025

లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

image

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.

News November 19, 2025

50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: లడ్డా

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. భారీగా ఆయుధాలు కూడా సీజ్ చేశాం. నిన్న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. ఛత్తీస్‌గఢ్/తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.

News November 19, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.