News July 30, 2024
వచ్చే నెల 14 నుంచి వైద్య కళాశాలల ప్రవేశ ప్రక్రియ

TG: వైద్యవిద్య కోర్సుల్లో(ఎంబీబీఎస్, యునాని, హోమియో, ఆయుర్వేదం) ప్రవేశానికి వచ్చే నెల 14 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC) నిర్ణయించింది. వచ్చే నెల మొదటివారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ సమాచారం కోసం ఎంసీసీ వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు తెలిపారు. జాతీయస్థాయి కోటాలోని 15శాతం సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ జరగనుంది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


