News October 4, 2025

యంగ్ ఇండియా స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

image

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 2026-27కి గాను 1-6 తరగతుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు <>https://yipschool.in/<<>>లో లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని DGP కార్యాలయం వెల్లడించింది. 50% సీట్లు పోలీస్ సిబ్బందికి, మిగతా 50% సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు కేటాయించింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా అకడమిక్, స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయని తెలిపింది.

Similar News

News October 4, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.870 పెరిగి రూ.1,19,400కు చేరింది. అటు 22K బంగారం 10 గ్రాములకు రూ.800 పెరిగి రూ.1,09,450 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలోకి రూ.3 వేలు పెరిగి రూ.1,65,000కు చేరింది.

News October 4, 2025

అక్టోబర్ 15 వరకు గడువు

image

‘AP బ్రాండ్ అంబాసిడర్’ నమోదుకు ముగింపు గడువు దగ్గర పడుతోంది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్-2047లో యువతను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ డిజిటల్ మారథాన్‌కు ఆహ్వానం పలికింది. SEP 30తోనే గడువు ముగియగా, కాలేజీల విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును OCT 15 వరకు పొడిగించారు. ఇప్పటికే ఈ <>మారథాన్‌<<>>లో లాగిన్ చేసుకొని 715 వీడియోలు, షార్ట్స్ పంపారు.

News October 4, 2025

DAY-3: భారత్ డిక్లేర్డ్

image

IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి నిన్న రెండో రోజు ఆట ముగించింది. ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించకుండానే డిక్లేర్ చేసింది. 286 పరుగుల వెనుకంజతో WI సెకండ్ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. నిన్న మన బ్యాటర్లు రాహుల్, జడేజా, జురెల్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.