News April 29, 2024

ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఫలితాలు విడుదల

image

ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈనెల 21న నిర్వహించిన ఈ పరీక్షకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థి ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 13, 2025

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఢిల్లీ సర్కార్ చట్టం

image

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అనుమతించిన ఫీజు ధరలనే స్కూల్స్‌ వసూలు చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25, అడ్మిషన్ ఛార్జీలు రూ.200గా నిర్ణయించారు. 3 ఏళ్లపాటు ఫీజులు స్థిరంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇటువంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తే బాగుంటుంది కదా?

News December 13, 2025

APPLY NOW: డిగ్రీ అర్హతతో 451 పోస్టులు

image

UPSC త్రివిధ దళాల్లో 451 పోస్టులను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 13, 2025

మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

image

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.