News April 29, 2024

ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఫలితాలు విడుదల

image

ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈనెల 21న నిర్వహించిన ఈ పరీక్షకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థి ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 14, 2025

భారీ జీతంతో NHAIలో ఉద్యోగాలు..

image

NHAIలో 84 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, B.L.Sc, MA, డిగ్రీ, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు Dy. mngrకు రూ.56,100-రూ.1,77,500, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ Asst.కు రూ.35,000-రూ.1,12,400, Jr ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400-రూ.1,12,400, అకౌంటెంట్‌కు రూ.29,200-రూ.92,300, స్టెనో‌గ్రాఫర్‌కు రూ.25,500-రూ.81,100 చెల్లిస్తారు.వెబ్‌సైట్: nhai.gov.in

News December 14, 2025

ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

image

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News December 14, 2025

ఓటుకు రూ.40వేలు.. రూ.17 కోట్ల ఖర్చు?

image

TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.40వేల చొప్పున పంచడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వెండిగ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేశారని తెలుస్తోంది. మద్యం పంపిణీకే రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అటు మరికొన్ని చోట్ల గెలిచేందుకు అభ్యర్థులు రూ.లక్షల్లో వెచ్చించినట్లు సమాచారం.