News April 29, 2024
ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఫలితాలు విడుదల

ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈనెల 21న నిర్వహించిన ఈ పరీక్షకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థి ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News December 11, 2025
BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

గిద్దలూరు మాజీ MLA పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్థులయ్యారు. వయో భారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ్ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి TDP నుంచి పోటీ చేసి 1994లో MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
News December 11, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు.
వెబ్సైట్: https://examinationservices.nic.in/
News December 11, 2025
చలికాలం.. పశువులు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో కోళ్లు, పాడి పశువులకు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ. అందుకే కోళ్లు, పశువుల ప్రవర్తనను గమనించాలి. పోషకాలతో కూడిన మేత, దాణా, మంచి నీటిని వాటికి అందించాలి. అవసరమైన టీకాలు వేయించాలి. పశువుల కొట్టాలు, కోళ్ల ఫారమ్ చుట్టూ పరదాలు కట్టాలి. ఈ సమయంలో పాడి, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


