News April 11, 2024

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు.. గడువు పెంపు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో, 261 బీసీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సెట్ కన్వీనర్ బి.సైదులు తెలిపారు. ఈనెల 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలోని 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు.

Similar News

News December 18, 2025

MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News December 18, 2025

‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్

image

AP: PPP మోడల్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘PPPలో అభివృద్ధికి త్వరలో 4 కాలేజీలను భాగస్వాములకిస్తాం. ఇది తప్పయితే వైద్య శాఖ మంత్రినైన నన్ను జైలుకు పంపే చర్యలు తీసుకోవచ్చు’ అని సవాల్ విసిరారు. PPPని కేంద్రం, నీతి ఆయోగ్, కోర్టులు సమర్థించాయని, అందుకని PM మోదీ సహా అందరినీ జైలుకు పంపిస్తావా? అని నిప్పులు చెరిగారు.

News December 18, 2025

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు

image

TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్(D) కలెక్టర్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్‌ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ టైమింగ్స్ మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు.