News May 27, 2024

టీటీడీ కాలేజీల్లో అడ్మిషన్లు.. దరఖాస్తుకు 4 రోజులే ఛాన్స్

image

AP: 2024-25 విద్యా సంవత్సరానికి టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు <>దరఖాస్తు<<>> ప్రక్రియ ఈనెల 31తో ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో బాలికలకు 968 సీట్లు, శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బాలురకు 792 సీట్లు అందుబాటులో ఉన్నాయి. టెన్త్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం అందిస్తారు.

Similar News

News December 16, 2025

భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

image

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News December 16, 2025

‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

image

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.

News December 16, 2025

స్పిన్నర్‌కు భారీ ధర

image

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్‌(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్‌(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.