News February 7, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.
Similar News
News December 2, 2025
హిల్ట్ పాలసీపై BRS పోరు బాట

TG: <<18440700>>హిల్ట్<<>> పాలసీతో ప్రజలకు నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీని కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. HYD చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో ఈ టీమ్స్ పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


