News May 23, 2024
అమ్మాయిల దత్తత పెరుగుతోంది

AP: రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో 325 మంది చిన్నారులను దత్తత తీసుకోగా, అందులో 186 మంది బాలికలే ఉండటం విశేషం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల దంపతులు 262 మందిని, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే తదితర దేశాల కపుల్స్ 63 మందిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 శిశుగృహాల్లో 0-6 ఏళ్లలోపు 110 మంది చిన్నారులున్నారు. వారి దత్తత కోసం 1,018 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News November 27, 2025
విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.
News November 27, 2025
నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

1888: లోక్సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం
News November 27, 2025
టీమ్ఇండియా ఓటమిపై గిల్ రియాక్షన్

SAతో హోమ్ టెస్ట్ సిరీస్లో టీమ్ఇండియా వైట్వాష్ కావడంతో వస్తున్న విమర్శలపై కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటిసారి స్పందించారు. “ప్రశాంత సముద్రాలు ఎలా ముందుకు సాగాలో నేర్పించవు.. తుఫాన్లే బలమైన చేతులను తయారు చేస్తాయి. మేమంతా ఒకరినొకరం నమ్ముకుని ముందుకు సాగుతాం” అని SMలో పోస్ట్ చేశారు. గాయం కారణంగా గిల్ రెండో టెస్ట్తో పాటు SAతో ODI సిరీస్కు సైతం దూరమైన విషయం తెలిసిందే.


