News March 30, 2024
ఇంట్లోనే అడ్వాణీకి భారతరత్న ప్రదానం

ఈరోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో నలుగురికి భారతరత్న పురస్కారాలు అందజేశారు. మాజీ పీఎం పీవీ నరసింహరావు, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, మాజీ PM చరణ్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డు అందుకున్నారు. అయితే అడ్వాణీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి, ప్రధాని రేపు ఆయన ఇంటికి వెళ్లి అవార్డు ప్రదానం చేయనున్నారు.
Similar News
News March 17, 2026
ఫుట్బాల్ ఫ్యాన్స్కి ఫిఫా అదిరిపోయే గిఫ్ట్

2026 వరల్డ్ కప్ మ్యాచ్లు ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే టోర్నీలో ప్రతి మ్యాచ్ మొదటి 10 నిమిషాలను బ్రాడ్కాస్టర్లు తమ యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఫిఫా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా కొన్ని సెలక్టెడ్ మ్యాచ్లను పూర్తిస్థాయిలో ఫ్రీగా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి WC అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుంది.
News March 17, 2026
నవోదయ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) JNVST 6వ తరగతి ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేసింది. షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్ ఖరారు అవుతుంది. రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News March 17, 2026
ఏపీకి అదనపు LPG, తెలంగాణకు ఎప్పుడు?

ఏపీకి కేంద్రం అదనంగా <<19410312>>24,000<<>> మెట్రిక్ టన్నుల LPGని కేటాయించగా, తెలంగాణ ఇంకా స్పందన కోసం ఎదురుచూస్తోంది. వాణిజ్య అవసరాల కోసం అదనపు LPG కోరుతూ మంత్రి ఉత్తమ్ 3 రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్లో కొరతతో హోటల్ పరిశ్రమ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. నేటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్తమ్ కేంద్ర అధికారులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.


