News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం
భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
Similar News
News February 10, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.
News February 10, 2025
ఇలాంటి మోసం చూడలేదయ్యా!
విమానాల్లో విండో సీట్కు డిమాండ్ ఎక్కువ. అయినప్పటికీ చాలామంది ఇష్టంతో ఎక్కువ డబ్బులైనా చెల్లించి విండో సీటు బుక్ చేసుకుంటుంటారు. అలానే బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి ఇండిగో ఎయిర్లైన్ షాక్ ఇచ్చింది. అసలు కిటికీనే లేని విండో సీటు ఇచ్చారంటూ అతను చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. అతడు తమిళ స్టార్ స్పోర్ట్స్లో క్రికెట్ కామెంటేటర్ కావడంతో ట్వీట్ ట్రెండ్ అవుతోంది.
News February 10, 2025
అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్
క్రికెట్లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్ కోసం పాక్ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేశారు.