News February 10, 2025

నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

image

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

Similar News

News November 28, 2025

DKకి మద్దతు తెలిపిన స్వామీజీ ఎవరో తెలుసా?

image

కర్ణాటకలో <<18406507>>అధికార పోరు<<>> కొనసాగుతున్న వేళ ఇటీవల ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ డీకే శివకుమార్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్వామీజీ ఎవరనే చర్చ మొదలైంది. 72వ పీఠాధిపతిగా ఉన్న ఈయన ఆదిచుంచనగిరి వర్సిటీ ఛాన్సలర్‌గానూ, 500కు పైగా విద్యాసంస్థలను పర్యవేక్షించే ట్రస్ట్‌కి అధ్యక్షుడిగానూ ఉన్నారు. స్వామీజీ సివిల్ ఇంజినీరింగ్‌ చేసి, చెన్నై IIT నుంచి MTech, ఫిలాసఫీలో PhD చేశారు.

News November 28, 2025

ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

News November 28, 2025

ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.