News October 26, 2024
భారత్కు అఫ్గాన్ షాక్

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్లో అఫ్గాన్-ఏ చేతిలో భారత్-ఏ పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్ 206 రన్స్ చేసింది. సెదీకుల్లా(83), జుబైద్(64) రాణించారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏ 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమణ్ దీప్ సింగ్(64) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్, రహమాన్ చెరో 2 వికెట్లు తీశారు.
Similar News
News December 8, 2025
MHBD: తుది పోటీలో 468 సర్పంచ్ అభ్యర్థులు

MHBDజిల్లాలో మొదటి విడత మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి ఏకగ్రీవంతో పాటు, తుది పోటీలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొదటి విడత మండలాలు గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు మండలాల్లో 9 సర్పంచ్, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 468 సర్పంచ్ అభ్యర్థులు, 2421మంది వార్డు సభ్యులు తుది పోటీలో ఉన్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనునున్నాయి.
News December 8, 2025
నేపాల్లో అతిపెద్ద అవినీతి కేసు.. ఫేక్ బిల్లులతో!

నేపాల్లో చైనా నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అవినీతి జరిగింది. దీనిని $216 మిలియన్లతో పూర్తి చేయగా ఇందులో $74M(రూ.600కోట్లు) అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. చైనా కాంట్రాక్టర్తో ఏవియేషన్ అధికారులు, మాజీ మంత్రులు(5) కుమ్మక్కై ఫేక్ బిల్లులతో ప్రాజెక్ట్ వ్యయాన్ని $74M పెంచారు. కాగా ఇలా ఫేక్ బిల్లులతో వ్యయాన్ని పెంచి ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 8, 2025
EC షెడ్లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్) షెడ్లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.


