News November 24, 2024

ఎవర్నీ కొనట్లేదేంటి భయ్యా!

image

జట్లన్నీ పోటీపడి ఆటగాళ్లను సొంతం చేసుకుంటుంటే ముంబై ఇండియన్స్ మాత్రం ఐపీఎల్ వేలంలో సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పటి వరకు 24మంది ప్లేయర్స్ కొనుగోలు అవ్వగా, ఒక్కరినీ కూడా ఆ టీం తీసుకోలేదు. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అసలు వేలానికి ఎందుకొచ్చారని మండిపడుతున్నారు. ఇకనైనా ఆ జట్టు ప్లేయర్స్‌ను కొనుగోలు చేస్తుందేమో చూడాలి. ముంబై జట్టు ఖాతాలో రూ.45కోట్లు ఉన్నాయి.

Similar News

News December 10, 2025

బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

image

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్‌ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.

News December 10, 2025

న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

image

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <>ట్వీట్<<>> చేశారు.

News December 9, 2025

OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.