News August 17, 2024

20ఏళ్ల తర్వాత చెప్పులు ‘కలిపాయి’

image

MPకి చెందిన సురేశ్ మర్డర్ కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఫుట్‌పాత్‌పై పడుకోగా భిన్నంగా ఉన్న అతడి చెప్పులను చూసి కొందరు WB రేడియో క్లబ్‌కు సమాచారమిచ్చారు. మతిస్థిమితం లేక తప్పిపోయిన వారిని ఫ్యామిలీతో WBRC కలుపుతూ ఉంటుంది. ఆ చెప్పులు జైలులో ఇచ్చినవని గుర్తించి, ఫ్యామిలీ వివరాలు కనుక్కొని వారికి సమాచారం ఇచ్చింది. అలా ‘చెప్పుల’ వల్ల కుటుంబాన్ని కలిశాడతడు.

Similar News

News December 5, 2025

తిరుమలలో కొన్ని పేర్లు మారుతున్నాయి!

image

తిరుమలలోని కొన్ని వీధుల పేర్లను మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు టీటీడీ ప్రతిపాదనలు పంపగా ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఆర్బ్ సెంటర్, మేదరమిట్ట, ముళ్లగుంత వంటి పేర్లకు బదులు శ్రీవారి సేవలో తరించిన పరమ భక్తుల పేర్లను పెట్టనున్నారు. వీటికి సంబంధించిన మార్పులను టీటీడీ త్వరలో అధికారికంగా అమలు చేసే అవకాశం ఉంది.

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 5, 2025

రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

image

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.