News June 13, 2024

40 ఏళ్ల తర్వాత చిత్తూరుకు దక్కని మంత్రి పదవి

image

AP: రాష్ట్ర కేబినెట్‌లో చిత్తూరు జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఇలా జరగడం 40ఏళ్లలో రెండోసారి మాత్రమే. 1983లో TDP ఆవిర్భవించిన తర్వాత NTR తిరుపతి నుంచి గెలిచారు. 15 మందితో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో చిత్తూరు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. ఈసారి 14 స్థానాలకు 12 గెలిచినా పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. అదే జిల్లాకు చెందిన చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వలేదని సమాచారం.

Similar News

News December 3, 2025

మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

image

టీమ్‌‌‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.

News December 3, 2025

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

image

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.

News December 3, 2025

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>డ్రెడ్జింగ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, రెసిడెంట్ మేనేజర్, Asst కంపెనీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నేటి నుంచి ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. dredge-india.com