News November 13, 2024

కాసేపట్లో కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డి

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో నరేందర్ కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 8, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌(<>IIIM)<<>> 19 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in/

News November 8, 2025

కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News November 8, 2025

భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.