News March 20, 2025
అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారు: కేటీఆర్

TG: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపిందని కేటీఆర్ విమర్శించారు. తాజా బడ్జెట్ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని దుయ్యబట్టారు. అధికారం కోసం అశోక్ నగర్ వెళ్లి, తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు.
Similar News
News November 5, 2025
పంజాబ్& సింధ్ బ్యాంక్లో 30 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్(<
News November 5, 2025
ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.
News November 5, 2025
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.


