News January 11, 2025
ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్

AP: సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2,800 ఎకరాలు ఇవ్వగా కొంత భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు.
Similar News
News February 1, 2026
శరీరంలో వేడిని ఎలా తగ్గించాలంటే?

కొందరి శరీరంలో ఎప్పుడూ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరినీళ్లు, కలబంద, పుదీనా జ్యూస్ వంటివి వేడి తగ్గడంలో సహకరిస్తాయి. మజ్జిగ, విటమిన్ సీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే కీరదోస, బీట్రూట్ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 1, 2026
పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల సిలిండర్ ధరను రూ.49 పెంచాయి. ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో రిటైల్లో ₹1,740.50 పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ట్రెండ్స్, దేశీయ వ్యయాల ఆధారంగా ధరలను కంపెనీలు సవరించాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. పాత ధరలే కొనసాగనున్నాయి.
News February 1, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులు.. అప్లై చేశారా?

AP: గుంటూరు జిల్లాలోని UPHC, PHCలో ఖాళీగా ఉన్న 45 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హతగల వారు <


