News January 1, 2025

మేం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో చరిత్ర తిరగరాసిన సంవత్సరం 2024 అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘గత ఐదేళ్లు ప్రజలు, మీడియా, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. రాజధాని అమరావతి నగరం ఫ్యూచర్‌లో అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.

News October 26, 2025

SSC దరఖాస్తు సవరణ తేదీల్లో మార్పులు

image

SSC వివిధ పోస్టుల దరఖాస్తులో తప్పుల సవరణ తేదీలను ప్రకటించింది. కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ (AWO) పోస్టులకు దరఖాస్తు సవరణ ఈనెల 31 – NOV 2వరకు చేసుకోవచ్చు. SI పోస్టులకు NOV 3 – 5 వరకు, HC (మినిస్టీరియల్) పోస్టులకు NOV 5 – 7 వరకు , కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు NOV 7 – 9 వరకు సవరణ చేసుకోవచ్చు. CHSL ఎగ్జామ్ స్లాట్ సిటీ, తేదీ, షిఫ్ట్‌ను ఈ నెల 28 వరకు ఎంపిక చేసుకోవచ్చు.

News October 26, 2025

ఎలాంటి ఎర పంటలను ఏ పంటల్లో వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు. ☛ క్యాబేజీలో సాధారణంగా వచ్చే డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంటను వేసి నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ అలసంద పంటలో ఆవాలు ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.