News May 20, 2024
పోలీస్ బైకు దొంగిలించి.. CM ఇంటికెళ్లి..!

తమిళనాడులోని రామనాథపురానికి చెందిన E.సంతోశ్ మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్ దొంగిలించి నేరుగా అల్వార్పేటలోని సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అయితే.. సీఎం నివాసం వద్ద అతడిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టిక్కర్ చూసి ఆరా తీయగా బైక్ దొంగిలించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రాష్ట్ర యువత మద్యం బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరేందుకే తాను CM ఇంటికి వెళ్లానని సంతోశ్ తెలిపారు.
Similar News
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.


