News June 20, 2024

మళ్లీ YS జగన్ ఓదార్పు యాత్ర!

image

AP: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Similar News

News November 22, 2025

సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

image

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.

News November 22, 2025

సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

image

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.

News November 22, 2025

వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

image

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>