News December 17, 2024
ఏజెంట్ మోసం.. 22 ఏళ్లుగా పాకిస్థాన్లోనే!

దుబాయ్లో ఉద్యోగమిప్పిస్తానంటూ ఓ ఏజెంట్ మోసం చేసి పాకిస్థాన్లో వదిలేయడంతో హమీదా బానో అనే భారతీయురాలు 22 ఏళ్లుగా అక్కడే ఉన్నారు. ఓ యూట్యూబర్ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో భారత్లోని ఆమె కుటుంబీకులు ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. అధికారుల సహకారంతో తాజాగా వాఘా సరిహద్దు మీదుగా బానో ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె స్వస్థలం ముంబై. భర్త చనిపోగా తన నలుగురు బిడ్డల్ని వంటపని చేస్తూ పోషించుకునేవారు.
Similar News
News November 21, 2025
శబరిమలై యాత్రికుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీటీవో

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైవర్లు మెళకువలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శబరిమలై యాత్రికులతో ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జిల్లా నుంచి తరలి వెళ్తున్నందున డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మంచు కురిసే సమయాల్లో డ్రైవింగ్ చేయవద్దని, సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆయన ఆదేశించారు.
News November 21, 2025
OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్గా పంత్

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


