News July 29, 2024
అగ్నిపథ్: రాహుల్ X రాజ్నాథ్

అగ్నిపథ్పై రాహుల్, రాజ్నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.
Similar News
News September 16, 2025
ఆంజనేయుడికి తన శక్తుల గురించి ఎందుకు తెలియదు?

ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు. బాల్యం నుంచి ఆయనకు అనేక శక్తులు ఉన్నాయి. కానీ తన అల్లరి చేష్టల వల్ల రుషులు హనుమంతుడ్ని శపిస్తారు. అందువల్లే ఆయన తన శక్తులను మర్చిపోయాడు. రాముని సేవలో లంకకు వెళ్లాల్సిన సమయంలో జాంబవంతుడు ఈ శాపాన్ని గుర్తుచేశాడు. అప్పుడు మారుతీ తన శక్తులను తిరిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ధర్మ సంస్థాపన కోసం మాత్రమే ఆయన తన శక్తులను ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి.
News September 16, 2025
నరదిష్టి పోవాలంటే ఇలా చేయండి!

ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే నరదిష్టి పోవాలంటే జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సంద్రపు నీటిని ఇంటిపైన, వ్యాపార స్థలంలో చల్లాలి. దొడ్డు ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం ఇంటి ముందు ఉంచాలి. బుధవారం పారే నీటిలో వేయాలి. ఆవు పేడ, పచ్చ కర్పూరం, పసుపు, కస్తూరి కలిపి అక్కడక్కడా చల్లాలి. ఉడికించిన బంగాళదుంపలను గోవుకు తినిపించడం కూడా శుభప్రదం’ అని చెబుతున్నారు.
News September 16, 2025
ఆమె ప్రతీకారమే.. పాండవుల విజయానికి కారణమైంది!

అంబ, శాల్వ మహారాజును ప్రేమించి, భీష్ముడి కారణంగా అతడిని కోల్పోయింది. దీనికి ప్రతీకారంగా భీష్ముడి చావుకు కారణమయ్యే వరం కోరి, ఆమె శిఖండిగా మళ్లీ జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు శిఖండిని చూసి ఆయుధాలను కింద పెట్టేస్తాడు. అలా శిఖండి తన పగను తీర్చుకుంటుంది. ఆమె వ్యక్తిగత పగతో భీష్ముడి చావుకు కారణమైనా, కౌరవ పక్షాన ఉన్న ధీరుడిని ఓడించడం ద్వారా.. ధర్మం గెలవడానికి ఆమె పరోక్షంగా తోడ్పడింది.