News July 29, 2024

అగ్నిపథ్: రాహుల్ X రాజ్‌నాథ్

image

అగ్నిపథ్‌పై రాహుల్, రాజ్‌నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.

Similar News

News April 3, 2026

కరీంనగర్: 50 శాతం పెరిగిన చార్జీలు

image

మీసేవ కేంద్రాల్లో ధృవీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులపై యూజర్ చార్జీలు 50 శాతం పెంచుతూ ఐటీ, కమ్యూనికేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.45–55 మధ్య ఉన్న సర్టిఫికెట్ ధరలు ప్రస్తుతం రూ.80కి పెరుగగా, సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 190 కిపైగా కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 25 మంది దాకా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా, ఎక్కువ మంది విద్యార్థులే కావటం గమనార్హం.

News April 3, 2026

TODAY HEADLINES

image

*అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం. BRS మద్దతు, వ్యతిరేకించిన YCP
*పవిత్ర మట్టికి CBN సాష్టాంగ నమస్కారం
*TG:రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారుల ఎంపిక
*TG:గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్
*‘మావిగన్’ పేరుతో సినిమా టైటిల్‌ రిజిస్టర్?
*ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!
*KKRతో మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం

News April 3, 2026

ప్రభుత్వాలు నడిచేది లిక్కర్ ఆదాయం మీదేనా?

image

TG: ప్రభుత్వాల ఆదాయానికి మద్యం అమ్మకాలు ఊపిరిగా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.40,209 కోట్ల రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్క ఏడాదిలోనే ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది కంటే ఈసారి రూ.2,700 కోట్లకు పైగా అధికంగా విక్రయాలు జరిగాయి. దీన్నిబట్టి లిక్కరే ప్రభుత్వాలకు బంగారు బాతు అని స్పష్టం అవుతోంది.