News November 11, 2024

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

image

ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘<<14569063>>నైతిక విలువల సలహాదారు<<>>’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నానని, పదవుల కోసం కాదని చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం చాగంటికి క్యాబినెట్ ర్యాంకుతో ఈ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News November 18, 2025

ఉలిక్కిపడిన రాష్ట్రం

image

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

News November 18, 2025

‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

image

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

News November 18, 2025

‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

image

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.