News August 22, 2024
ఓవైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!

TG: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా ఉంది. AICC ఆదేశాలతో అదానీ వ్యవహారంలో JPC విచారణకు డిమాండ్ చేస్తూ HYDలోని ED ఆఫీస్ ముందు ఈరోజు CM రేవంత్, మంత్రులు నిరసనకు దిగారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా JAN 17న ప్రభుత్వం అదానీ సంస్థతో రూ.12,400 కోట్లతో MOU కుదుర్చుకుంది. కాగా తాము అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News December 28, 2025
సీఎం రేవంత్ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
News December 28, 2025
ట్రైలర్ ఏది ‘రాజాసాబ్’?

నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తీరా చివరివరకు వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈవెంట్ చివర్లో ట్రైలర్ రేపు వస్తుందని ప్రభాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 28, 2025
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.


