News August 21, 2024

ఇంజిన్ల వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేస్తాం: రైల్వే

image

దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజిన్ల వద్ద ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ జయవర్మ ప్రకటించారు. రైల్వే ట్రాక్స్‌పై అసాధారణ పరిస్థితుల్ని గుర్తించడంలో ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు 900 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Similar News

News December 10, 2025

ICC వన్డే ర్యాంకింగ్స్‌: టాప్‌-2లో రోహిత్, కోహ్లీ

image

ICC తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. AUSతో ODI సిరీస్ తర్వాత కెరీర్‌లో తొలిసారి ఫస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ అదే స్థానంలో కొనసాగుతున్నారు. SAతో జరిగిన ODI సిరీస్‌లో విరాట్ సెంచరీలతో చెలరేగడంతో రెండు స్థానాలు ఎగబాకి టాప్-2కి చేరారు. అటు టీ20 బ్యాటింగ్‌లో తొలిస్థానంలో అభిషేక్, ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్య 4వ ప్లేస్‌కు చేరుకున్నారు.

News December 10, 2025

బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.

News December 10, 2025

వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.