News June 24, 2024
ORR పక్కన 200 ఎకరాల్లో ఏఐ సిటీ.. త్వరలో శంకుస్థాపన!

HYD పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు TG ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ORR పక్కన సుమారు 200 ఎకరాల్లో దీనిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూములను గుర్తించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. జులైలో జరగనున్న గ్లోబల్ AI సమ్మిట్కు ముందే దీనికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 7, 2025
‘రాజాసాబ్’కు ఆర్థిక సమస్యలా?.. నిర్మాత క్లారిటీ!

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా <<18489140>>రిలీజ్<<>> వాయిదా పడటం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ గురించీ ఊహాగానాలు రావడంతో నిర్మాత TG విశ్వ ప్రసాద్ స్పందించారు. ‘సినిమా విడుదలకు అంతరాయం కలిగించే ప్రయత్నం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. రాజాసాబ్ కోసం సేకరించిన పెట్టుబడులను క్లియర్ చేశాం. మిగిలిన వడ్డీని త్వరలోనే చెల్లిస్తాం’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
News December 7, 2025
వంటింటి చిట్కాలు

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టండి.
* ఇంట్లో తయారు చేసిన స్వీట్స్లో షుగర్ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరసం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్ కూడా వాడొచ్చు.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
News December 7, 2025
అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.


