News July 11, 2024

ఏఐ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్

image

భారత్ టెక్ రంగంలో 2-3 ఏళ్లలో ఏఐపై పట్టున్న ఇంజినీర్ల అవసరం ఉందంటున్నారు నిపుణులు. పది లక్షలకుపైగా ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. AI, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రాణించాలంటే ఇప్పుడున్న ఉద్యోగుల్లో సగం మందిపైన తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇందుకు తగినట్టు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడం వంటి చర్యలు చేపట్టకుంటే డిమాండ్‌ను అందుకోవడం కష్టమని తెలిపారు.

Similar News

News January 3, 2026

ప్యూరిఫైయర్లపై GST కట్? సామాన్యులకు భారీ ఊరట!

image

వాయు కాలుష్యం, కలుషిత నీటి సమస్యల తీవ్రత నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 18% పన్ను ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ధరలు తగ్గి సామాన్యులకు ఇవి మరింత అందుబాటులోకి వస్తాయి. రాబోయే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీటిని ‘లగ్జరీ’ కేటగిరీ నుంచి ‘అవసరమైన’ వస్తువులుగా గుర్తించనున్నారు.

News January 3, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. కీలక అప్‌డేట్

image

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్(<>GD<<>>) పోస్టుల పరీక్షకు సంబంధించి SSC కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. త్వరలో సెల్ఫ్ స్లాటింగ్‌ తేదీని వెల్లడించనుంది. అదేవిధంగా 7,948 MTS (నాన్ టెక్నికల్)పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 15వరకు సెల్ఫ్ స్లాటింగ్‌కు అవకాశం కల్పించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News January 3, 2026

చెదపురుగులతో పంటకు నష్టం.. నివారణ ఎలా?

image

వ్యవసాయంలో పంట మొలక నుంచి కోత వరకు అన్ని దశల్లో చెదపురుగుల వల్ల 10 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ పురుగులు పంట మొక్కల వేర్లను, చెట్ల కాండాన్ని ఆశించి లోపలి మెత్తని భాగాన్ని తినడం వల్ల అవి వడలిపోయి, ఎండి చనిపోతుంటాయి. చల్కా ఎర్రమట్టి నేలల్లో, నీటి ఎద్దడి ఉన్న తోటల్లో వీటి ఉద్ధృతి ఎక్కువ. ఏ పంటలకు చెదల ముప్పు ఎక్కువ? వీటిని ఎలా నివారించాలో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.