News October 11, 2025
మూడో తరగతి నుంచే AI పాఠాలు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే AIపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే AIపై పాఠాలు బోధిస్తున్నారు.
Similar News
News October 11, 2025
ఆత్మ జ్ఞానమే అత్యున్నత ధర్మం

ధర్మశాస్త్రాల ప్రకారం.. గొప్ప వాటిని రక్షించడానికి చిన్నవాటిని త్యాగం చేయవచ్చు. ఉదాహరణకు.. దేశం కోసం గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని వదులుకోవచ్చు. అయితే వీటన్నింటికంటే అత్యంత ప్రియమైనది, శాశ్వతమైనది ఆత్మ. భార్య, సంపదలు కూడా ఆత్మ ప్రీతి కోసమే మనకు ప్రియంగా మారుతాయి. ఇక్కడ ఆత్మ అంటే ఆ పరమాత్ముడే. ఆయన మనలోనే ఉంటాడు. ఇలా.. ఆత్మ జ్ఞానాన్ని పొందడమే జీవన పరమావధి అని విదురుడు చెబుతాడు. <<-se>>#Daivam<<>>
News October 11, 2025
ఈ నెల 24 నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు

TG: స్కూళ్లలో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు మొదటి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. 7, 9 తరగతులకు మధ్యాహ్నం, మిగిలిన తరగతులకు ఉదయం పూట పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 3న ఫలితాల ప్రకటన, 15న పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
News October 11, 2025
సెహ్వాగ్ సాయం.. U19 జట్టులో పుల్వామా అమరవీరుడి కుమారుడు!

పుల్వామా దాడిలో అమరుడైన విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ హరియాణా U19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన స్కూలులో రాహుల్కు ఉచిత విద్య, క్రికెట్ ట్రైనింగ్ అందిస్తున్నారు. U19 టీమ్కు రాహుల్ ఎంపికవడం గర్వంగా ఉందని సెహ్వాగ్ తెలిపారు. రాహుల్ గతంలో హరియాణా U14, U16 జట్లకు ఆడాడు. కాగా మరో అమర జవాన్ రామ్ వకీల్ తనయుడు అర్పిత్ కూడా సెహ్వాగ్ స్కూలులోనే చదువుతున్నాడు.