News January 19, 2025
సైఫ్, కరీనా నవ్వుతున్న AI ఫొటో.. ఎంపీపై విమర్శలు

సైఫ్ అలీఖాన్పై దాడి దురదృష్టకరమని నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ బెడ్పై, కరీనా పక్కనే కూర్చుని నవ్వుతున్నట్లు ఉన్న AI జనరేటెడ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి ఫొటోలు పంచుకోవడం అవసరమా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.
Similar News
News December 19, 2025
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న విరాట్, రోహిత్

భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ తమ జట్టు తరఫున ఆడతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అటు ఈ టోర్నమెంట్లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఆడనున్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
News December 19, 2025
₹7,910 కోట్ల ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా పేరు

AP: పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా గుర్తుండేలా రాష్ట్రంలో ₹7,910 కోట్లతో చేపట్టే మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా ప్రభుత్వం నామకరణం చేసింది. రానున్న 30 ఏళ్ల నాటికి 5 ఉమ్మడి జిల్లాల పరిథిలో 1.21 కోట్లమంది దాహార్తిని ఈ ప్రాజెక్టు తీర్చనుంది. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకు ఈ స్కీమ్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుంది. జలధార పోస్టర్ను Dy CM పవన్ ఆవిష్కరించారు.
News December 19, 2025
ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు

TG: రాష్ట్రంలో వరి సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.649 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


