News April 4, 2025
AI వినియోగం.. భవిష్యత్పై బిల్గేట్స్ జోస్యం!

ఏఐ రాక నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలెలా ఉంటాయన్నదానిపై బిల్ గేట్స్ పలు ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. అవి:
* వారానికి రెండు రోజులే పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏఐ పనిచేస్తుంది.
* దాదాపు ఉద్యోగాలన్నీ ఏఐ చేతిలోకి వెళ్లిపోతాయి.
* ఏఐ వలన అన్ని రంగాల్లో మేథ అందరికీ ఉచితంగా లభిస్తుంది.
* కోడింగ్, బయాలజీ, ఇంధన రంగాల్లోకి మాత్రం ఏఐ రాలేదు.
Similar News
News April 11, 2025
గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్పై దాడి కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని జిన్పింగ్!

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ట్రంప్-జిన్ పింగ్ల మధ్య వ్యక్తిగతంగా చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. సుంకాలపై జిన్పింగ్ను ట్రంప్ ప్రైవేటుగా హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను జిన్ ఏ మాత్రం పట్టించుకోలేదని, బదులుగా టారిఫ్స్ను 125 శాతానికి పెంచారని పేర్కొంది. ఇరు అగ్రదేశాల మధ్య ఘర్షణ ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News April 11, 2025
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుతో TNకు మేలు: పవన్ కళ్యాణ్

AP: తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఎన్నికలకు వెళ్లాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘BJP-AIADMK కూటమికి శుభాకాంక్షలు. అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తామని కూటమి తెలిపింది. NDA విధానాల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తమిళనాడుకు కచ్చితంగా మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నారు.