News April 10, 2024
మరో ఏడాదిలో మనుషుల కంటే స్మార్ట్గా ఏఐ: మస్క్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో లేదా రెండేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందన్నారు. అయితే ఏఐకి అబద్ధం చెప్పడం నేర్పించకూడదని ఒకసారి దానికి అది అలవాటు పడితే ఇక ఆపడం చాలా కష్టం అవుతుందని హెచ్చరించారు. ట్రైనింగ్ చిప్స్ కొరత, విద్యుత్ డిమాండ్ AIకి సవాల్గా మారుతాయనే టాక్ నడుస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Similar News
News December 10, 2025
ICC వన్డే ర్యాంకింగ్స్: టాప్-2లో రోహిత్, కోహ్లీ

ICC తాజా వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. AUSతో ODI సిరీస్ తర్వాత కెరీర్లో తొలిసారి ఫస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ అదే స్థానంలో కొనసాగుతున్నారు. SAతో జరిగిన ODI సిరీస్లో విరాట్ సెంచరీలతో చెలరేగడంతో రెండు స్థానాలు ఎగబాకి టాప్-2కి చేరారు. అటు టీ20 బ్యాటింగ్లో తొలిస్థానంలో అభిషేక్, ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్య 4వ ప్లేస్కు చేరుకున్నారు.
News December 10, 2025
బీట్రూట్తో హెల్తీ హెయిర్

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.
News December 10, 2025
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.


