News October 15, 2024

తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరీని ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్కను మహారాష్ట్రలోని మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర రీజియన్లకు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News October 15, 2024

ఈ ఫ‌ర్నీచ‌ర్‌ను 8 ర‌కాలుగా వాడుకోవ‌చ్చు

image

తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో అన్నిర‌కాల ఫర్నీచ‌ర్‌ను ఏర్పాటు చేసుకోలేం. దీనికి ప‌రిష్కారంగా IIT గువాహ‌టికి చెందిన ప్రొ.సుప్ర‌దీప్ దాస్ ప‌రిశోధ‌కుల బృందం స్పేస్ సేవింగ్ ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చైర్‌, టేబుల్‌, స్టోరేజ్ యూనిట్‌గా ఉపయోగపడుతుంది. ప‌రిశోధ‌న క్ర‌మంలో దీనికి రూ.35 వేలు ఖ‌ర్చైనా, మాస్ ప్రొడ‌క్ష‌న్‌తో ధ‌ర త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

News October 15, 2024

వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక

image

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయనాడ్ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్నట్లు AICC తెలిపింది. అంతకుముందు ఈ స్థానంలో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. కాగా NOV 13న వయనాడ్ ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పాలక్కడ్ నుంచి రాహుల్ మమ్కుతహిల్, చెలక్కర నుంచి రమ్య పోటీ చేస్తారని కాంగ్రెస్ పేర్కొంది.

News October 15, 2024

సీనియర్‌గా మంత్రి పదవి ఆశిస్తున్నా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

image

TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహేశ్ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ పదవి అదే ప్రాతిపదికన ఇచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. పైరవీలతో మంత్రి పదవులు ఇవ్వరన్నారు.