News April 4, 2025
రాష్ట్రంలో నియంత్రణలోనే ఎయిడ్స్.. స్థానం మెరుగుదల

AP: ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మంచి పనితీరు కనబరిచింది. గతేడాది వరకు 17వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 7వ ప్లేస్కు చేరినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) తెలిపింది. 2024 APR- DEC మధ్య మంచి పనితీరు కనబరిచినట్లు చెప్పింది. 2004 నుంచి రాష్ట్రంలో దాదాపు 2,25,000 మంది బాధితుల్ని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యాధి నియంత్రణకు రూ.127cr ఖర్చు చేసినట్లు న్యాకో పేర్కొంది.
Similar News
News December 1, 2025
పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: రేవంత్ రెడ్డి

పాలమూరు ప్రాంతం గత వలస పాలకుల ఏలుబడిలో అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు ఎక్కువ మంది MLAలను గెలిపించిన ప్రజల విశ్వాసంతో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల MNK ప్రాజెక్టులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
News December 1, 2025
ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.


