News April 4, 2025
రాష్ట్రంలో నియంత్రణలోనే ఎయిడ్స్.. స్థానం మెరుగుదల

AP: ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మంచి పనితీరు కనబరిచింది. గతేడాది వరకు 17వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 7వ ప్లేస్కు చేరినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) తెలిపింది. 2024 APR- DEC మధ్య మంచి పనితీరు కనబరిచినట్లు చెప్పింది. 2004 నుంచి రాష్ట్రంలో దాదాపు 2,25,000 మంది బాధితుల్ని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యాధి నియంత్రణకు రూ.127cr ఖర్చు చేసినట్లు న్యాకో పేర్కొంది.
Similar News
News December 11, 2025
ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామాల అధిపతులెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
-కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్లో
News December 11, 2025
1950+ విమానాలను నడుపుతున్నాం: ఇండిగో

ఇవాళ 1,950కి పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. 138 గమ్యస్థానాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. నెట్వర్క్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. డిసెంబర్ 8 నుంచి ఇండిగోలో నెట్వర్క్ సమస్యలు తలెత్తి వందలాది ఫ్లైట్లు రద్దయిన విషయం తెలిసిందే.
News December 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 35

ఔర దేవతా చిత్త న ధరయీ|
హనుమత సేయి సర్వ సుఖ కరయీ||
మహాబలశాలి, చిరంజీవి అయిన హనుమంతుడిని నిరంతరం తలచుకోవడం ద్వారా మనం అన్ని కష్టాలు, భయాల నుంచి విముక్తి పొంది, సకల సౌఖ్యాలను పొందుతాము. ఆంజనేయ స్వామిని నమ్మిన వారికి సర్వదా విజయమే కలుగుతుంది. ఆయనను భక్తితో ఆరాధించిన వారికి అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, శుభాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>


