News September 21, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

image

AP: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికీ చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. YCP పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

Similar News

News September 21, 2024

పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య

image

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 21, 2024

జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్

image

AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్‌ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్‌ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.

News September 21, 2024

బోయపాటి-బాలకృష్ణ మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?

image

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ ద్వయం నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ కాంబోలో మరో చిత్రం రానుండగా దసరాకు షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా తమన్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తోంది. సూపర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనుందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.