News July 4, 2024
భారత క్రికెటర్ల కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు

బార్బడోస్లో ఉన్న భారత క్రికెటర్లు ఎయిర్ ఇండియా విమానంలో భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్లైట్ నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సినదని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి ఆటగాళ్ల కోసం బార్బడోస్కు మళ్లించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయలేదని సోషల్ మీడియాలో వాపోయారు. దీంతో సీరియస్ అయిన DGCA తమకు సమగ్ర నివేదికను అందించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.
Similar News
News October 22, 2025
ఛోక్సీ కోసం ఆర్థర్ రోడ్ జైలు సిద్ధం!

ఆర్థిక నేరస్థుడు మెహుల్ <<18037252>>ఛోక్సీ<<>> కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిద్ధమైంది. బ్యారక్ నం-12లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇందులో 2 రూములు ఉండగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను అధికారులు బెల్జియం ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలోనే ఛోక్సీని భారత్కు బెల్జియం అప్పగించే అవకాశం ఉంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్థర్ రోడ్ జైలులోనే గతంలో 26/11 నిందితుడు అజ్మల్ కసబ్ను ఉంచారు.
News October 22, 2025
సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా నక్షత్రంతో లెక్కించేవారు. ఈ నక్షత్రం పేరు మీదుగానే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. ఈ ఆరు తారలే ఆరు తలలు గల సుబ్రహ్మణ్య స్వామికి తల్లిలా పాలు ఇచ్చాయట. ఈ అనుబంధం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి ‘కార్తికేయ’ అనే నామం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక స్టోరీల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
ఆస్తులు పెరిగాయి కానీ.. ఉపాధి తగ్గింది

తయారీ రంగంపై ASI ఆసక్తికర అంశాలు వెల్లడించింది. FY24లో మిషనరీ, ల్యాండ్ ఇతర కేపిటల్ వ్యయం 12.6% పెరగ్గా ఉపాధి 7.8%కే పరిమితమైంది. పెరిగిన పోటీ, ఆధునిక సాంకేతికతతో యంత్రాలపై పెట్టుబడి పెరిగినట్లు పేర్కొంది. యంత్ర పరిశ్రమలో 12.9% ఉద్యోగాలు పెరగ్గా 29.7% పెట్టుబడి ఉన్న వస్త్రరంగంలో తగినంత ఉద్యోగ కల్పన కనిపించలేదంది. టెక్నాలజీ అభివృద్ధితో వీటి నిష్పత్తిలో వ్యత్యాసం తప్పదని నిపుణులు అభిప్రాయపడ్డారు.