News June 7, 2024

ఎయిర్ ఇండియా – విస్తారా విలీనానికి ఆమోదం

image

ఎయిర్ ఇండియా, విస్తారా విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో 25.1% వాటా దక్కనుంది. ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఎయిర్ఇండియా అంచనా వేస్తోంది. ఎయిర్ ఇండియా టాటా కంట్రోల్‌లో ఉండగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో సంయుక్తంగా విస్తారాను నిర్వహిస్తోంది. ఈ విలీనంతో ఎయిర్ఇండియా దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కేరియర్‌గా నిలవనుంది.

Similar News

News September 9, 2025

ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

image

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

image

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

image

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.