News April 20, 2024
2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలు?

2026 నాటికి దేశంలో ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృసంస్థ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ ఈ సేవలు అందించనున్నాయి. తొలుత ఢిల్లీ.. ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఇవి ఎగరనున్నాయి. ట్యాక్సీల్లో పైలట్తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. దీని ధర 1 బిలియన్ డాలర్లు ఉంటుంది. 27 కి.మీ దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఛార్జి ఉండనుంది.
Similar News
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<
News January 18, 2026
చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

చైనాలోని ఓ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News January 18, 2026
ఆర్టీసీకి భారీ ఆదాయం.. 5 రోజుల్లో రూ.67కోట్లు

TG: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఛార్జీల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకి సగటున రూ.13.48కోట్లు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులను నడపగా, రోజుకి అదనంగా రూ.2.70కోట్లు వీటి ద్వారానే సమకూరినట్లు చెప్పారు. ఇవాళ, రేపు కూడా స్పెషల్ బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.


