News December 6, 2024
ఎయిర్లైన్స్ నెల ముందే టిక్కెట్ ధరలు చెప్పాలి: కేంద్రం

విమానయాన సంస్థలు టికెట్ ధరలను మార్చడానికి నెలరోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ధరల నియంత్రణకు కొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎయిర్లైన్స్ తమ టికెట్ ధరలు 24 గంటల్లోనే మార్చుకునేందుకు వీలు కల్పించే 2010 నిబంధనను తొలగిస్తున్నాం. ఎయిర్లైన్స్ ఇష్టారాజ్యంగా ధరలు మార్చడానికి వీల్లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
సాయంకాలం నిద్రపోతున్నారా?

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 15, 2025
రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.
News October 15, 2025
మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.