News November 27, 2024

వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు: రామ్మోహన్ నాయుడు

image

TG: రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో భూసేకరణ పూర్తవ్వగానే వీలైనంత త్వరగా పనులు చేపడుతామని చెప్పారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.

News September 16, 2025

ఇంట్లో శంఖం ఉంచవచ్చా?

image

ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ‘శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి. వాస్తు దోషాలు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణువులకు శంఖం ప్రియమైంది. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుంది. శంఖం ఊదడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని అంటున్నారు.

News September 16, 2025

హనుమంతుడు స్త్రీ రూపంలో వెలసిన ఆలయం

image

ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉన్న ‘గిరిజాబంద్ హనుమాన్ ఆలయం’ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న రాజు పృథ్వీ దేవ్జూ కలలో కనిపించిన హనుమంతుడు, ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. నిర్మాణం పూర్తయ్యాక, జలాశయం నుంచి బయటపడిన స్త్రీ రూపంలోని హనుమాన్ విగ్రహాన్నే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత రాజుకు వ్యాధి నయమైంది.