News April 18, 2024
లింగ నిష్పత్తిపై అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లింగ నిష్పత్తిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులు, 850 మంది మహిళలుగా ఉంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ద్రౌపదికి ఎదురైన పరిస్థితి రావొచ్చు’ అని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పేర్కొన్నారు. ద్రౌపదికి ఐదుగురితో వివాహమైందన్న విషయాన్ని ఉద్దేశిస్తూ పవార్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


