News January 11, 2025
కారు రేసు నుంచి తప్పుకొన్న అజిత్

దుబాయ్లో జరిగే కార్ రేసులో పాల్గొనడం లేదని నటుడు అజిత్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ రేసులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కారు రేసు నుంచి తాను వైదొలగుతున్నట్లు తెలిపారు. తన టీమ్ పోటీలో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.
Similar News
News November 25, 2025
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 701 మంది విద్యార్థులు గైర్హాజరు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 10,856 మంది విద్యార్థులకు గాను 10,155 మంది విద్యార్థులు హాజరు కాగా 701 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిజామాబాద్లో పలు పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించినట్లు తెలిపారు.
News November 25, 2025
‘సచివాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వండి’

AP: గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం చేసి వచ్చే మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు, అధికారులకు సూచించారు. వారికి ప్రమోషన్లు, ఇతర శాఖల్లో అనుసంధానించడంపై సమీక్షించారు. పదోన్నతులు కల్పించినా సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ముందుకెళ్లాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రతినెలా సమావేశం అవుదామని చెప్పారు.
News November 25, 2025
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 701 మంది విద్యార్థులు గైర్హాజరు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 10,856 మంది విద్యార్థులకు గాను 10,155 మంది విద్యార్థులు హాజరు కాగా 701 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిజామాబాద్లో పలు పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించినట్లు తెలిపారు.


